Friday, September 20, 2024
Homeతెలంగాణమరో మూడు రోజులు వర్షాలు..

మరో మూడు రోజులు వర్షాలు..

భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండకు అరెంజ్ అలర్ట్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ, సిద్ధిపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు పలుజిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయంటూ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. అయితే, వాతావరణంలో మార్పులు, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను వల్లే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఇంటీరియర్‌ కర్ణాటక, మరాఠ్వాడా వరకు ద్రోణి కేంద్రీకృతమై ఉందని వివరించారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments