Monday, April 14, 2025
Homeక్రైమ్ప్రాణం తీసిన పుష్ప..

ప్రాణం తీసిన పుష్ప..

ప్రాణం తీసిన పుష్ప2

ప్రీమియర్ షోలో తొక్కిసలాట

మహిళా ప్రేక్షకురాలి మృతి

బాలుడి పరిస్థితి విషమం 

స్పాట్ వాయిస్, హైదరాబాద్: దిల్ ష్కు. నగర్  ఏరియాకి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 ఎం ఎంకు వెళ్ళింది. ఆ సమయంలో హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రాగా అభిమానులు ఒక్కసారిగాథియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు.

 

ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజ తీవ్రంగా గాయపడిఅపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే పోలీసులు వారిని విద్య నగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు. అయితే రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments