Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్రాష్ట్రాన్ని కాపాడుతున్న మందుబాబులు..

రాష్ట్రాన్ని కాపాడుతున్న మందుబాబులు..

రాష్ట్రాన్ని కాపాడుతున్న మందుబాబులు
2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.32 వేల కోట్ల ఆదాయం
42.99 కోట్ల లీటర్ల బీరు తాగేశారు..

స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణలో ఈ ఏడాది ఆదాయం రెండు శాఖల నుంచే భారీగా వచ్చింది. రూ.72 వేల కోట్లతో వాణిజ్య పన్నుల శాఖ ఫస్ట్ ఉండగా.. ఆబ్కారీ శాఖ రూ.31,560 కోట్లతో రెండోస్థానంలో ఉంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రూ.35,036 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. రికార్డు స్థాయిలో 42.99 కోట్ల లీటర్ల బీరు తాగేశారు. లిక్కర్‌ కంటే బీర్లే ఎక్కువగా విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలో జరిగిన మొత్తం మద్యం అమ్మకాల్లో 70 శాతం హైదరాబాద్‌, దాని పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, నల్గొండ, మెదక్‌ జిల్లాల్లోనే ఉంది.
జిల్లాల్లో ఇలా..
2022-23లో జరిగిన మొత్తం అమ్మకాల్లో అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో రూ.3739.42 కోట్లు, రంగారెడ్డి రూ.8410 కోట్లు, నల్గొండ రూ.3538 కోట్లు, మేడ్చల్‌ రూ.1326 కోట్లు, మెదక్‌ రూ.2917 కోట్లు, ఆదిలాబాద్‌ రూ.1438 కోట్లు, కరీంనగర్‌ రూ.2934 కోట్లు, ఖమ్మం రూ.2222 కోట్లు, మహబూబ్‌నగర్‌ రూ.2488 కోట్లు, నిజామాబాద్‌ రూ.1652 కోట్లు, వరంగల్‌ రూ.3471 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ, మద్యం లైసెన్స్‌ల ద్వారా ఆదాయం వస్తోంది. ఇప్పటి వరకు జరిగిన రూ.35,036 కోట్ల విలువైన మద్యం అమ్మకాల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే.. రాష్ట్రంలో ప్రతీ నెల సగటున రూ.2,900 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్ముడుపోతుంది. ఈ మద్యం విక్రయాల ద్వారా ప్రతీ నెల రూ.1,150 కోట్ల నుంచి రూ.1,250 కోట్ల వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా రూ.1,450 కోట్లు వస్తున్నాయి. సర్కారు ఖజానాకు సగటున నెలకు రూ.2,630 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అధికారుల అంచనా. అంటే మొత్తం 12 నెలల్లో దాదాపు రూ.31,560 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments