Saturday, April 19, 2025
Homeక్రైమ్ప్రాణహిత పుష్కరాల్లో విషాదం..

ప్రాణహిత పుష్కరాల్లో విషాదం..

స్నానానికి నదిలోకి దిగి మునిగిపోయిన భక్తుడు..
స్పాట్ వాయిస్, మంచిర్యాల: ప్రాణహిత పుష్కరాల్లో విషాదం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద నదిలో స్నానం కోసం దిగిన వ్యక్తి నీటిలో మునిగిపోయాడు. గుర్తించిన భక్తులు అధికారులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన గజ ఈతగాళ్లు అతడిని బయటకు తీశారు. అయితే అతడు అప్పటికే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మృతుడిని విశాఖపట్నానికి చెందిన గుడ్ల సోమేశ్‌గా గుర్తించారు. మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments