Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్మటన్ షాప్ వద్ద పోలీసుల బందోబస్తు..

మటన్ షాప్ వద్ద పోలీసుల బందోబస్తు..

మటన్ షాప్ వద్ద పోలీసుల బందోబస్తు..

కిలో మటన్ రూ.400
భారీగా తరలివచ్చిన మాంసం ప్రియులు..

స్పాట్ వాయిస్ , సిద్దిపేట: మటన్ షాపు వద్ద పోలీసుల బందోబస్తు.. వింటే ఆశ్చర్యం.. నవ్వు వచ్చిన ఇది నిజం. ఇది ఎక్కడో జరగలేదు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్‌పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అసలే ఆదివారం, ఆపై పెద్దల అమావాస్య.. అంతకుమించి..రూ. 400కే కిలో మటన్ . ఇంకేముంది.. మాంసం ప్రియులు ఎగబడ్డారు. ఉదయం నుంచే భారీగా తరలివచ్చి క్యూ కట్టారు. చుట్టుపక్కల మండలాల నుంచి భారీగా గుంపులుగుంపులుగా తరలివచ్చారు. మటన్ తీసుకోవాలంటే సుమారు రెండు నుంచి మూడు గంటల పాటు క్యు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకానొక సమయంలో మటన్ షాపుల వద్ద తోపులాట చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మాంసం దుకాణాల వద్ద ఎటువంటి ప్రమాదం జరగకుండా బందోబస్తు నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments