Sunday, May 25, 2025
Homeజిల్లా వార్తలుపోడు రైతులకు త్వరలో పట్టాలు

పోడు రైతులకు త్వరలో పట్టాలు

నెలాఖరుకు ప్రారంభకానున్న పంపిణీ ప్రక్రియ
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
స్పాట్ వాయిస్, నర్సంపేట: నియోజకవర్గంలోని గిరిజన రైతులకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుభవార్త చెప్పారు. పోడు భూములకు పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ నెలాఖరులో పట్టాల పంపిణీ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 3371 మంది రైతులకు గాను 7333 ఎకరాల విస్తీర్ణంలో పట్టాల ముద్రణ పూర్తి అయిందన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరిగిన అనంతరం నర్సంపేటలో ప్రారంభమవుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న సుమారు 95 శాతం మందికి పట్టాలను అందజేయడం జరుగుతుందన్నారు. మరో 360 మంది రైతుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. గిరిజనేతరుల సర్వే పూర్తి అయిందని వీటికి సంబంధించి హద్దులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిదన్నారు. వీరికి పట్టాలపైన త్వరలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments