Friday, September 27, 2024
Homeజాతీయందసరా కానుకగా.. పీఎం కిసాన్

దసరా కానుకగా.. పీఎం కిసాన్

స్పాట్ వాయిస్, బ్యూరో: కేంద్ర సర్కార్ రైతులకు దసరా కానుక ఇవ్వనుంది. ప్రధానమంత్రి కిసాన్ పథకం 18వ విడత నిధులను అక్టోబర్ 5న నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. 17వ విడత నిధులు జూన్ 18న విడుదల చేశారు. ఇప్పుడు 18వ విడత నిధులు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 6 వేలు రైతులకు సాయం చేస్తోంది. 2018 డిసెంబర్‌లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతోంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2వేల చొప్పున మూడు వాయిదాలలో డబ్బు ఇస్తున్నారు. పీఎం కిసాన్ యోజన 16వ విడతలో 93 మిలియన్ల మంది రైతులు రూ.2వేలు పొందారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments