Saturday, September 21, 2024
Homeజాతీయంప్రధానికి టీపీసీసీ చీఫ్ 9 ప్రశ్నలు

ప్రధానికి టీపీసీసీ చీఫ్ 9 ప్రశ్నలు

స్పాట్ వాయిస్, హైదరాబాద్: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తొమ్మిది ప్రశ్నలతో ఆయన లేఖ రాశారు. తెలంగాణ ప్రజలు అంటే ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు మోడీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

1) ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించడానికి మీకున్న ఇబ్బందేంటని ప్రశ్నించారు. కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ ఆ ప్రాజెక్టును రీడిజైన్ చేశారని ఆరోపించారు.
2) కాళేశ్వరంలో అవినీతిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదన్నారు.
3) నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందన్నారు.
4) విభజన హామీల్లో భాగంగా బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ.. ఐటీఐఆర్‌ ప్రాజెక్టులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ప్రశ్నించారు.
5) ఒడిస్సాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ల కుంభకోణంలో కేసీఆర్ బంధువుల పాత్ర ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ పై ఈగ వాలకుండా కాపాడుతున్నది మీరు కాదా అని నిలదీశారు.
6) పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందని ప్రశ్నించారు.
7) గిరిజన యూనివర్సిటీకి ఇప్పటికీ అతిగతీ లేదని, పైగా ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మూసివేశారు. దీనిపై స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారా లేదా చెప్పాలన్నారు.
8) రైతుల చావులకు బాధ్యులు మీరు కాదా అని ప్రశ్నించారు.
9) రామయణ సర్క్యూట్ లో భద్రాద్రి రాముడికి చోటేందుకు ఇవ్వలేదన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments