ఉత్సాహంగా పాల్గొంటున్న ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులు
స్పాట్ వాయిస్, క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. 11 కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం వరంగల్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్లోని కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేంద్రాల్లోకి అనుమతించారు. దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన ప్రతి దశనూ సీసీ కెమెరాలతో నమోదు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి మొదటివారంలో ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ పూర్తికానుంది. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ 1600 మీటర్ల పరుగును ప్రారంభించారు.
Recent Comments