Sunday, May 25, 2025
Homeజిల్లా వార్తలుఫొటో ట్రేడ్ ఎక్స్ పో ను విజయవంతం చేయాలి 

ఫొటో ట్రేడ్ ఎక్స్ పో ను విజయవంతం చేయాలి 

ఫొటో ట్రేడ్ ఎక్స్ పో ను విజయవంతం చేయాలి 

జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ రఫీ 

స్పాట్ వాయిస్, గణపురం: ఈనెల 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్ ఎల్ బినగర్ లోని కేబిఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే ఫోటో ట్రేడ్ ఎక్స్ పో ను విజయవంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా   ఫొటో గ్రాఫర్ . అసోసియేషన్ అధ్యక్షులు ఎండి రఫీ విజ్ఞప్తి చేశారు. శనివారం గణపురం మండల ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫొటోట్రేడ్ ఎక్స్ పో పోస్టర్ల ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు అందరూ హాజరై విజయవంతం చేయాలని రఫీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గోపరాజు, రాజు నేరెళ్ల శ్రీనివాస్ కొండు మల్లేష్ గణపురం మండలం ఫొటో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి షేక్ మదార్, కార్యదర్శి ఇంజపెల్లి కిరణ్ మోరే రాజు, నాగపురి శ్రీనివాస్ గౌడ్, వడ్డేపల్లి శీను అంకం రాజు అరిగే జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments