Wednesday, April 16, 2025
Homeక్రైమ్పడ్డాడా...? పడేశారా..!

పడ్డాడా…? పడేశారా..!

బిల్డింగ్ పై నుంచి పడి ఫార్మసీ విద్యార్థి మృతి
స్పాట్ వాయిస్, క్రైం: హన్మకొండలో విషాదం నెలకొంది. శుక్రవారం చైతన్య ఫార్మసీ కళాశాల వసతి భవనం 3వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు ఫార్మా డీ విద్యార్థి రబిహుల్ ఖాన్ కిందపడ్డాడు. గమనించిన స్నేహితులు హుటాహుటిన క్షతగాత్రుడిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ రబీహుల్ ఖాన్ మృతి చెందాడు. ఎంజీఎం మార్చురీ లో మృతదేహాన్ని భద్రపర్చారు. రబీహుల్ ఖాన్ ది పశ్చిమ బెంగాల్. అతడి మృతి వెనుక అనేక అనుమానాలు ఉన్నట్లు పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా?. ఎవరైనా కావాలనే తోసేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments