Sunday, May 25, 2025
Homeజిల్లా వార్తలుపేకాట స్థావరంపై పోలీసుల దాడి..

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..

  • పేకాట స్థావరంపై పోలీసుల దాడి

స్పాట్ వాయిస్ దామెర: మండలంలోని ల్యాదేల్లా గ్రామ శివారులో దామెర, హసన్ పర్తి మండలాల లోని పలు గ్రామాలకు చెందిన ఆరుగురు యువకులు పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై ముత్యం రాజేందర్ సిబ్బంది తో  కలిసి పేకాట స్థావరంపై దాడి చేశారు. 5గురు యువకులను పట్టుకోగా, ఒకరు తప్పించుకున్నట్లు ఆయన తెలిపారు. పేకాటరాయుల నుంచి రూ. 26వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు, ఆటో, బైక్ ను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments