Friday, September 20, 2024
Homeక్రైమ్స్పాట్ క్రైం... 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

స్పాట్ క్రైం… 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
-ముగ్గురిపై కేసు నమోదు

స్పాట్ వాయిస్, రేగొండ: అక్రమంగా తరలిస్తున్న 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్న కోడెపాకకు చెందిన కొందరు వ్యక్తులు డీసీఎంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో డీసీఎం.వ్యాను భాగిర్తిపేట వద్ద మరమ్మతుకు గురైంది. దీంతో అక్రమా ర్కులు మరో డీసీఎంను తెప్పించి బియ్యం బస్తాలను అందులోకి మారుస్తుండగా పక్కా సమాచారం మేరకు ఎస్సె శ్రీకాంత్ రెడ్డి సివిల్ సప్లై అధికారుల ఆధ్వర్యంలో పట్టుకున్నారు. రెండు డీసీఎంలతో పాటు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్టే షన్కు తరలించారని తెలుస్తోంది. సివిల్ సప్లై డీటీ లింగాల బుచ్చిబాబు ఫిర్యాదు మేరకు చిన్నకోడెపాక కి చెందిన కక్కేర్ల సంపత్, కక్కేర్ల నాగరాజు, కక్కేర్ల సదానందం పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

Recent Comments