Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో పెద్దంపల్లి యువకుడి ప్రతిభ

రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో పెద్దంపల్లి యువకుడి ప్రతిభ

ప్రత్యేక ప్రతిభావంతుల పోటీల్లో పసుల రాజుకు ప్రత్యేక బహుమతి
హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు
స్పాట్ వాయిస్, రేగొండ : రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రత్యేక ప్రతిభావంతుల క్రికెట్ టోర్నమెంట్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన మూగ యువకుడు పసుల రాజు ప్రతిభ కనబర్చి ప్రత్యేక బహుమతి సాధించారు. శని, ఆదివారం హైదరాబాదులో జరిగిన ప్రత్యేక ప్రతిభావంతుల టీ 20 క్రికెట్ టోర్నమెంట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మూగ యువకులు పాల్గొన్నారు. పెద్దంపల్లి కి చెందిన రాజు ఈ టోర్నమెంట్లో పాల్గొని సర్టిఫికెట్ తో పాటు, షీల్డ్ ను గెలుచుకున్నారు. మొదటి నుంచీ క్రికెట్ పై ఆసక్తి చూపుతున్న మూగవాడైన పసుల రాజు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజుకు స్థానికులు, స్నేహితులు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments