Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహం పెట్టాలి...

ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహం పెట్టాలి…

ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలి

మోకు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల రమేష్ గౌడ్
స్పాట్ వాయిస్, నర్సంపేట : తెలంగాణ బహుజన వీరుడు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. నెక్కొండ మండలం సూరిపెల్లి గ్రామంలో తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన దొమ్మటి పురుషోత్తంను శనివారం మోకుదెబ్బ నాయకులు పరామర్శించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. సంబండ వర్గాలను ఏకం చేసి 12 వేల సైన్యంతో గోల్కొండకోటను స్వాధీనం చేసుకొని పరిపాలన చేసిన ధీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. పాపన్న గౌడ్ పేరును జనగామ జిల్లాకు పెట్టాలని, గౌడ ఆత్మ గౌరవ భవనం ట్రస్ట్ గా కాకుండా సొసైటీగా ఏర్పాటు చేయాలని రమేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జిల్లా నాయకుడు దొనికేల సారంగపాణి గౌడ్, అంబాలా రాంగోపాల్ గౌడ్, మండల అధ్యక్షులు లింగాల వెంకన్న గౌడ్, పల్సం నవీన్ గౌడ్, కోటగిరి సాంబయ్య గౌడ్, మాదాటి శ్రీనివాస్ గౌడ్, గడ్డం సంతోష్ గౌడ్, కొంకాల రాజు గౌడ్, చీకటి రాజు గౌడ్, కొత్తకొండ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments