Friday, May 30, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి

ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి

సీసీ రోడ్డు పనుల బిల్లు కోసం రూ.1.20 వేల డిమాండ్
రూ.50వేలు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
జనగామ జిల్లాలో కలకలం
స్పాట్ వాయిస్, జనగామ: సీసీ రోడ్డు పనుల బిల్లుల కోసం లంచం అడిగిన గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని శివునిపల్లి గ్రామంలో రూ.25 లక్షలతో సీసీ రోడ్డు పనులు చేశారు. ఈ పనుల బిల్లుల కోసం పంచాయతీ కార్యదర్శి కుర్ర చిరంజీవి డబ్బులు డిమాండ్ చేశారు. రూ. 1.20 వేలు అడగడంతో సబ్ కాంట్రాక్టర్ శివరాత్రి కొమురయ్య మొదట రూ.15వేలు ఇచ్చాడు. మళ్లీ రూ.50వేలు డిమాండ్ చేయగా.. కొమురయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు పక్క ప్లాన్ వేసి గ్రామపంచాయతీ కార్యదర్శి కుర్ర చిరంజీవిని డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments