Sunday, June 8, 2025
Homeజిల్లా వార్తలుపొలం కోస్తుండగా.. హార్వెస్టర్ దగ్ధం

పొలం కోస్తుండగా.. హార్వెస్టర్ దగ్ధం

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామ శివారులోని పొలం కొస్తున్న హార్వెస్టర్ దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పగుడాల పరమాత్మ అనే రైతు వ్యవసాయ భూమిలో వరి కోస్తుండగా హార్వెస్టర్ కు విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ కు గురైన హార్వెస్టర్ కాలి బూడిదింది. పరమాత్మ నర్సిహులు పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు.
వరికోత మిషన్ రఘనాథపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన ఎండీ.అస్లాం అనే వ్యక్తిది. మిషన్ పూర్తిగా కాలిపోవడంతో అస్లాం బోరున విలపించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments