Friday, September 20, 2024
Homeక్రైమ్ఆన్ లైన్ గేమ్ ఆడిన యువకుడు..

ఆన్ లైన్ గేమ్ ఆడిన యువకుడు..

రూ.40వేలు ఖాళీ..
తల్లిదండ్రులు తిడుతారని ఆత్మహత్య..
స్పాట్ వాయిస్, నర్సంపేట( నెక్కొండ): ఆన్ లైన్ గేమ్ కు ఓ యువకుడి ప్రాణం పోయింది. ఈ విషాద ఘటన నెక్కొండ మండలం అప్పల్ రావుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బాషబోయిన కమలాకర్-స్వప్న దంపతుల రెండో కొడుకు ఉదయ్(19) శుక్రవారం రాత్రి ఆన్ లైన్ గేమ్ ఆడారు. ఈ క్రమంలో దాదాపు 40 వేల రూపాయలు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఇటీవల మృతుడి తండ్రి ధాన్యం అమ్మిన డబ్బులు రూ.50వేలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. ఉదయ్ తల్లి ఫోన్ లో ఆన్ లైన్ గేమ్ ఆడారు. ఆ ఫోన్ నంబర్ బ్యాంక్ అకౌంట్ కు లిక్ ఉండడంతో రూ.40వేలు పోగొట్టుకున్నాడు. విషయం తెలిస్తే అమ్మానాన్న తిడుతారో.. లేక కొడుతారోననే భయంతో ఇంట్లో వేరే గదిలో ఉన్న యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments