అప్పులు తీర్చలేననే భయంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
స్పాట్ వాయిస్, జనగామ: ఆన్లైన్ బెట్టింగ్లు యువకుడి ప్రాణం తీశాయి. జనగామ జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. రఘునాథపల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో అప్పులు తీర్చలేననే భయంతో ఉరివేసుకొని బీటెక్ విద్యార్థి నజీర్(21) ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి వచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణం తీసిన ఆన్ లైన్ బెట్టింగ్ లు..
RELATED ARTICLES
Recent Comments