Monday, May 26, 2025
Homeతెలంగాణనర్సంపేట-కొత్తగూడ మధ్య నిలిచిన రాకపోకలు

నర్సంపేట-కొత్తగూడ మధ్య నిలిచిన రాకపోకలు

స్పాట్ వాయిస్ నర్సంపేట (ఖానాపురం): ఖానాపూర్ మండలంలోని పాకాల చెరువు గురువారం నుంచి మత్తడి పడుతుంది. దీంతో అశోక్ నగర్ గ్రామం వద్ద ఉన్న లో లెవెల్ వంతెన పైనుంచి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.నర్సంపేట-కొత్తగూడ మండలాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం గుండా రాకపోకలు సాగించే ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ఖానాపురం ఎస్సై పిట్టల తిరుపతి కోరారు. ఈ రహదారి గుండా రాకపోకలు నిలిచిపోవడంతో ఖానాపూర్ మండలంలోని పెద్దమ్మ గడ్డ మీదుగా అశోక్ నగర్ క్రాస్ రోడ్డు వరకు వెళ్లే రహదారి మధ్యలో ఉన్న కల్వర్టు వద్ద రహదారి సక్రమంగా లేకపోవడంతో స్థానిక ఎస్సై తిరుపతి రోడ్డును చదును చేయించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments