Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుమోడెం ఎల్లాగౌడ్ కు సన్మానం

మోడెం ఎల్లాగౌడ్ కు సన్మానం

స్పాట్ వాయిస్, నర్సంపేట: యువజన కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లాగౌడ్ ని ఆదివారం గాంధీ భవన్ లో సన్మానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో డోర్ డోర్ క్యాంపెనింగ్ లో భాగంగా ఇంటింటికీ తిరిగి ఐదు న్యాయాలు, 25 గ్యారంటీలను ప్రజలకు తెలియజేయడంలో రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లాగౌడ్ రెండో స్థానంలో నిలిచాడు. దీంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి సురభి దివేది గాంధీభవన్ లో సన్మానించారు. ఈసందర్భంగా ఎల్లగౌడ్ మాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి రావడానికి సహకరించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి, నియోజకవర్గ నాయకులకు, మండల నాయకులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments