Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలునామినేటెడ్ పదవులొచ్చాయి..

నామినేటెడ్ పదవులొచ్చాయి..

జనగామ మార్కెట్ కమిటీ నియామకం..
స్పాట్ వాయిస్, జనగామ :ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం ఎట్టకేలాకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీని నియమిస్తూ బుధవారం వ్యవసాయ శాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా జనగాం మండలం పెంబర్తి గ్రామానికి చెందిన ఉద్యమకారులు బిల్డే సిద్ధిలింగం కురుమ, వైస్ చైర్మన్ గా రఘునాథ్ పల్లి మండలం గోవర్ధనగిరికి చెందిన సీనియర్ నాయకులు మున్సిపట్ల విజయ, డైరెక్టర్ గా నూనెముందల యాకస్వామి గౌడ్, శివ రాత్రి రాజు, మాల రాజు ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీలో అవకాశం కల్పించిన మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తోపాటు ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందేలా పాటుపడతానని ఈ సందర్భంగా విజయ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments