Saturday, May 31, 2025
Homeక్రైమ్నేషనల్ పోలీస్ అకాడమీలో చోరీ

నేషనల్ పోలీస్ అకాడమీలో చోరీ

స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ పోలీస్ అకాడమీలో చోరీ జరిగింది. పకడ్బందీ భద్రత కలిగిన ఐపీఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అకాడమీలోని కంప్యూటర్లు మాయమయ్యాయి. భద్రతా బలగాల కళ్లు గప్పి దుండగుడు చాకచక్యంగా 7 కంప్యూటర్లు మాయం చేశాడు. కంప్యూటర్లు చోరీకి గురైన విషయాన్ని గమనించిన అధికారులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. దొంగతనం దృశ్యాలు పుటేజ్‌లో రికార్డు అయ్యాయి. అకాడమీలో ఐటీ సెక్షన్‌లో పని చేస్తున్న చంద్రశేఖర్‌ పట్టుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఎన్‌పీఏ అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments