Friday, June 6, 2025
Homeక్రైమ్వరంగల్ లో మర్డర్

వరంగల్ లో మర్డర్

వరంగల్ లో మర్డర్..
కత్తులతో దాడి
ఎస్సారార్ తోట వ్యక్తి మృతి
మరో ఇద్దరికీ గాయాలు..
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమం

క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు

స్పాట్ వాయిస్ , వరంగల్: వరంగల్ నగరంలో మర్డర్ కలకలం రేపింది. నగరంలో ని ఉర్సు గుట్ట వద్ద ఈ దారుణం జరిగింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో భట్టుపల్లి సమీపంలో ని ఓ బేకరీ వద్ద ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో కత్తులతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో వరంగల్ ఎస్ ఆర్ ఆర్ తోటకి చెందిన రాకేష్ మరణించాడు. కత్తిపోట్లతో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిల్స్ కాలనీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments