Monday, September 23, 2024
Homeక్రైమ్ఫస్ట్ కరెంట్ షాక్.. సెకండ్ యాక్సిడెంట్.. ఫైనల్ గన్..

ఫస్ట్ కరెంట్ షాక్.. సెకండ్ యాక్సిడెంట్.. ఫైనల్ గన్..

ఎంతదారుణం..
చంపించి.. తెలియనట్టు నటించింది..
వీడిన సింగరేణి కార్మికుడి హత్య..
స్పాట్ వాయిస్‌, డెస్క్: ఎంత ఘోరం.. కట్టుకున్న భార్య..భర్తను హత్య చేపించింది. పైగా తనకేమీ తెలియదన్నట్లుగా నటించింది.

వివరాల్లోకి వెళ్తే
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన రవళితో కొరకొప్పుల రాజేందర్‌(28)కు ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే రాజేందర్‌కు రవళి దూరంగా ఉంటూ వచ్చింది. ఆమెకు మరో వ్యక్తితో సాన్నిహిత్యం ఉన్నట్లు గుర్తించిన భర్త చాలా సార్లు నిలదీశాడు. ఇటీవలే జరిగిన పంచాయితీలో కలకాలం కలిసి జీవిస్తామని మాట ఇచ్చింది. అయితే తన తల్లిదండ్రులతో కలిసి ఉండటం రవళికి ఇష్టం లేకపోవడంతో రాజేందర్‌ పక్కనే వేరు కాపురం పెట్టాడు. ఆర్నెల్ల క్రితమే తండ్రి వారసత్వంగా సింగరేణి ఉద్యోగంలో చేరి శ్రీరాంపూర్‌ ప్రాంతంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం విధులకెళ్లి వచ్చి రాత్రి ఇంట్లో పడుకున్నా డు. తెల్లవారుజామున పథకం ప్రకారం రవళి ఇంటి తలుపులు తెరిచిపెట్టింది. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. ఒకడు లోపలికి వెళ్లి రాజేందర్‌ కుడి కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఇద్దరూ పరారయ్యారు.
గన్ సౌండ్ కు పక్కనే ఉంటున్న తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు బయటకు వచ్చి రాజేందర్‌ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి మంచంపై రక్తపుమడుగులో పడి ఉన్నాడం. భార్య రవళి తాను టాయిలెట్‌కని లేచి బయటకు వచ్చి, లోపలికి వెళ్లేసరికే హెల్మెట్‌ పెట్టుకున్న వ్యక్తి తుపాకితో కాల్పులు జరిపి పరారైనట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో క్రైం కథ వెలుగు చూసింది.

రెండుసార్లు మర్డర్ కు ప్లాన్..
భర్తను హతమార్చేందుకు రవళి ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకసారి ఇంటిగేటుకు కరెంట్ తీగను కలిపి పెట్టిందని తెలిపారు. ఆ సమయంలో అక్కడకు మరో వ్యక్తి రాగా చిన్న షాక్‌తో బయటపడ్డాడు. ఇటీవల ఓ కారు ఢీకొట్టడంతో రాజేందర్‌ గాయపడ్డాడు. దీని వెనకా భార్య ఉందంటున్నారు. హత్యకు గురైన రాజేందర్‌ ఇంటిని పెద్దపల్లి ఇన్‌ఛార్జి డీసీపీ రూపేశ్‌ పరిశీలించారు. రెండు తూటాలను, నిందితుడి హెల్మెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యలో భాగస్వాములైన చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకొని విచారిస్తున్నట్లు సమాచారం. రవళిని కూడా అదుపులోకి తీసుకొని మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.. తన కోడలు రవళి.. సన్నిహితుడు బందం రాజు, సయ్యద్‌తో కలిసి హత్య చేయించిందని మృతుడి తండ్రి మొండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments