Monday, April 21, 2025
Homeక్రైమ్రేగొండలో హత్య

రేగొండలో హత్య

రేగొండలో హత్య
స్పాట్ వాయిస్, రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హత్య కలకలం రేపింది. రేగొండ మండల కేంద్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన విరంచి అనే వ్యక్తిని తోటి కార్మికులు మద్యం మత్తులో చితకబాది హత్య చేశారు. ఆపై ఉరేసి పరారయ్యారు. బీహార్ కు చెందిన ఏడుగురు వ్యక్తులు మేస్త్రీ పని కోసం వచ్చి భాస్కర రాజు అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. బుధవారం రాత్రి మద్యం మత్తులో గొడవపడి విరంచి అనే కార్మికుని తోటి కార్మికులు బండరాళ్లతో కట్టెలతో చితకబాదారు. హత్య చేసి అనంతరం తాడుతో ఉరివేసి పరారయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments