Saturday, April 19, 2025
Homeక్రైమ్300 కోసం చంపేశారు..

300 కోసం చంపేశారు..

శ్మశానంలోక తీసుకెళ్లి మరి…
తాగిన మైకంలో దారుణం..
స్పాట్ వాయిస్, కరీంనగర్: తాగిన మైకం.. వారితో మర్డర్ చేయించింది. రూ.300కు ఆశపడి అన్నదమ్ములిద్దరూ జైలు పాలయ్యారు. ఈఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లికి చెందిన సాయిలు(35), మల్లేష్‌(45) అన్నదమ్ములు. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. శంకర్‌పల్లిలో నివాసం ఉండే మల్లేష్‌ వద్దకు గత నెల 25న సాయిలు వచ్చాడు. ఈక్రమంలో ఇద్దరు కలిసి ఫుల్ గా మద్యం తాగారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం, చెరుకుపల్లికి చెందిన చెన్నయ్య(55) సమాచారం కోసం వీరితో మాట్లాడాడు. అయితే తాగిన మైకంలో ఉన్న వారు చెన్నయ్యపై దాడి చేశారు. ఆ సమయంలో చెన్నయ్య జేబులోంచి రూ.300, ఫోన్‌ కింద పడగా.. వాటిని అన్నదమ్ములు చూశారు. చెన్నయ్య వాటిని తీసుకోని వెళ్తుండగా.. అన్నదమ్ములు వెంబడించి శ్మశానవాటికలోకి తీసుకెళ్లారు. బండరాతితో కొట్టి హత్య చేశారు. రూ.300, ఫోన్‌ తీసుకుని పరారయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments