Tuesday, June 3, 2025
Homeక్రైమ్కార్పొరేటర్ ఆఫీసులో మర్డర్

కార్పొరేటర్ ఆఫీసులో మర్డర్

హైదరాబాద్ లో కలకలం..
స్పాట్ వాయిస్, క్రైం:  హైదరాబాద్ లో యువకుడి హత్య కలకలం సృష్టించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లలిత్‌భాగ్‌ కార్పొరేటర్‌ కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లలితాభాగ్‌కు చెందిన ఏఎంఐఎం కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అతని మేనల్లుడు సయ్యద్‌ ముక్తాజాపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలకు గురైన ముక్తాజాను ఆస్పతికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ సోదరి కొడుకే ముక్తాజా. మృతుడు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాడు. అయితే, స్నేహితుల మధ్య గొడవే ఈ హత్యకు కారణమని తెలుస్తున్నది. కార్పొరేటర్‌ కార్యాలయంలో ఉండగానే ఏకకాలంలో దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆరుగురు వ్యక్తులు కలిసి ముక్తాజాపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వెంటనే సయ్యద్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments