Sunday, April 20, 2025
Homeక్రైమ్ముద్ర బ్యాంక్ సిబ్బంది నిర్భంధం

ముద్ర బ్యాంక్ సిబ్బంది నిర్భంధం

స్పాట్ వాయిస్ , నల్లబెల్లి: ముద్రబ్యాంక్ మేనేజర్, సిబ్బందిని ఆదివారం నల్లబెల్లి గ్రామస్తులు నిర్బంధించారు. నల్లబెల్లి శాఖలో 150 మంది సభ్యులను చేర్చుకొని రోజువారీ నెలవారీ పద్ధతిలో డబ్బులు కట్టించుకున్నారు. దాదాపు ఏడాదిన్నరగా వ్యాపారం చేస్తూ రూ. 45 లక్షలు వసూలు చేశారు. అలాగే ముద్ర బ్యాంకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో 235 శాఖలను తెరిచి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో ఆగ్రహించిన కస్టమర్లు ఆదివారం మేనేజర్, సిబ్బంది ఆఫీస్ దగ్గరికి రాగా గదిలో నిర్బంధించారు. మంగళవారం సిబ్బంది వచ్చి సమస్య పరిష్కరిస్తారని ఎస్సై హామీ ఇవ్వడంతో వదిలేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments