Saturday, June 7, 2025
Homeజిల్లా వార్తలుదాడులపై మోడీ స్పందించాలి

దాడులపై మోడీ స్పందించాలి

దళితులపై దాడుల విషయంలో మోడీ స్పందించాలి 

సేవాలాల్ సేన

స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : సొంత రాష్ట్రం గుజరాత్ లో దళితులపై జరుగుతున్న దాడులపై నరేంద్ర మోడీ స్పందించాలని సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ సంతోష్ నాయక్ బుధవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్యం వచ్చి 75 ఏండ్లు గడిచిన అస్పృశ్యత, సామాజిక అసమానతలు ఇంకా సమాజాన్ని పట్టిపీడిస్తూనే ఉన్నాయన్నారు, నేటి ఆధునిక సమాజంలో కూడా గుజరాత్ రాష్ట్రంలో దళిత మహిళను ఆలయంలోకి రాకుండా అగ్రవర్ణానికి చెందిన ఓ మహిళ అడ్డుకోవడం, దానిని ప్రశ్నించినందుకు సామాజిక బహిష్కరణ చేయడం బాధాకరమన్నారు. బీజేపి చేస్తున్న విభజన రాజకీయాల వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. విభజన రాజకీయాలతో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments