Monday, September 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్ములుగులో ఎదురుకాల్పులు..

ములుగులో ఎదురుకాల్పులు..

 స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మండలంలోని వీరాపురం సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో శుక్రవారం పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా దామెరతోగు సమీప అడవుల్లో కూంబింగ్‌ పార్టీకి.. మావోయిస్టులు తారపడ్డారు. దీంతో అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరుపక్షాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments