స్పాట్ వాయిస్, గణపురం: సికింద్రాబాద్ లోని సౌమ్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాష్ ను మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మంగళవారం పరామర్శించారు. వీరమల్ల ప్రకాష్కు అందుతున్న వైద్య సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మంచి వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మిత్రుడు వీరమల్ల ప్రకాష్ త్వరగా కోలుకోవాలని సిరికొండ ఆకాంక్షించారు. కాసేపు ప్రకాష్ తో ఎమ్మెల్సీ ముచ్చటించారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వీరమల్ల ప్రకాష్కు ఎమ్మెల్సీ సిరికొండ పరామర్శ
RELATED ARTICLES
Recent Comments