Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్విచారణకు ముందు ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్

విచారణకు ముందు ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్

విచారణ కు ముందు ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్

హాజరుకాలేనని మెయిల్..

హాజరుకవాల్సిందేనన్న ఈడీ

స్పాట్ వాయిస్, బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్ ఇచ్చారు. తాను విచారణకు హాజరుకాలేనని ఈడీకి మెయిల్ ద్వారా సమాచారం పంపారు. ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని కవిత పేర్కొన్నారు. అలాగే తాను అనారోగ్యంగా ఉన్నానని, అందుకే సమయం ఇవ్వాలని కోరారు. అయితే కవిత విజ్ఞప్తికి ఈడీ డైరెక్టర్ అంగీకరించలేదు.విచారణకు రావాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో కవిత ఈ రోజు విచారణకు వెళ్తారా లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఆమె వెళ్లకపోతే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చర్చగా మారింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments