Monday, September 23, 2024
Homeతెలంగాణఎమ్మెల్సీ కవితకు కరోనా

ఎమ్మెల్సీ కవితకు కరోనా

ఎమ్మెల్సీ కవితకు కరోనా
హోం ఐసొలేషన్ లో చికిత్స
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత కరోనా బారిన పడ్డారు. రెండు ‌మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్నారు. సోమవారం పరీక్ష చేయించుకోగా వైద్యులు కొవిడ్​గా నిర్ధారించారు. తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని.. ఆరోగ్యంగానే ఉన్నానని కవిత తెలిపారు. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో ఉన్న కవిత ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆమె ట్విటర్​లో పోస్ట్ చేశారు. అలాగే ఎవరికి వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా వైరస్‌ని వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్విట్‌లో పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత ప్రస్తుతం హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నారు. ఇటీవలే మంత్రి కేటీఆర్​ కూడా కొవిడ్ బారిన పడి కోలుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments