Saturday, April 19, 2025
Homeలేటెస్ట్ న్యూస్ముగిసిన కవిత విచారణ

ముగిసిన కవిత విచారణ

ముగిసిన కవిత విచారణ

రేపు మళ్ళీ రావాలని ఈడీ నోటీసులు..!

స్పాట్ వాయిస్, బ్యూరో : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈడీ ఆఫీసు నుంచి ఆమె రాత్రి 9 గంటల 15 నిమిషాల సమయంలో బయటకు వచ్చారు. సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆఫీసులోకి వెళ్లిన కవిత.. పది గంటల సుదీర్ఘ విచారణ తర్వాత బయటకు వచ్చింది. మంగళవారం మరోసారి విచారణ కు రావాలి అని ఈడీ నోటీసులు ఇచిన్నట్లు సమాచారం. విచారణ సమయంలోనే కవిత తరపున ముగ్గురు లాయర్లు ఈడీ ఆఫీసులోకి వెళ్లటం.. ఆ తర్వాత ఇద్దరు వైద్య సిబ్బంది ఆఫీసులోకి వెళ్లి రావటం.. అందులో ఓ మహిళా వైద్యురాలు ఉండటంతో పలు రకాలు ప్రచారం జరిగింది.

ఈ పరిణామాల మధ్య రాత్రి తొమ్మిది గంటల 15 నిమిషాల సమయంలో ఈడీ విచారణ ముగించుకుని బయటకు వచ్చారు. వెంటనే తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. కవిత బయటకు రావటంతో.. కార్యకర్తలు, నేతలు ఊపిరిపీల్చుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments