Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుఅగ్ని ప్రమాదంలో మృతులకు అండగా ఎమ్మెల్యే పెద్ది

అగ్ని ప్రమాదంలో మృతులకు అండగా ఎమ్మెల్యే పెద్ది

అగ్ని ప్రమాదంలో మృతులకు అండగా ఎమ్మెల్యే పెద్ది..

రూ.50వేల ఆర్థిక సాయం

స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్ : సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన‌ కుటుంబాలకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అండగా నిలిచారు. మృతుల్లో ముగ్గురు నర్సంపేట నియోజకవర్గానికి చెందినవారే కావడంతో ప్రమాద ఘటనపై మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఫోన్ లో మాట్లాడి అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి కోరారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలు స్వగ్రామానికి తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ఓదార్చి ధైర్యం చెప్పారు.

రూ50వేల ఆర్థిక సాయం

ఎమ్మెల్యే… ఒక్కో కుటుంబానికి వ్యక్తిగతంగా రూ. 50 వేల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. మృతుల్లో దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ వెన్నెల, ఖానాపూర్ మండలానికి చెందిన బానోతు శ్రావణి ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments