జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి గాయాలు
చికిత్స అందిస్తున్న యశోధ హాస్పిటల్ వైద్యులు
కల్వకుంట్ల కవిత, కేసీఆర్ సతీమణి శోభ పరామర్శ
స్పాట్ వాయిస్, హైదరాబాద్: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గాయపడ్డాడు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోని బాత్రూంలో కాలు జారి కింద పడిపోగా, ఆయన కాలికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానిక నాయకులు వెంటనే అంబులెన్స్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ సోమాజి గూడలోని యశోధ హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు బుధవారం (ఈరోజు) హాజరు కానున్న సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎర్రవల్లి ఫాంహౌస్కు వెళ్లారు. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంగళవారం రాత్రి నుంచి ఫాంహౌస్లోనే ఉన్నారు. కాగా, విషయం తెలిసిన వెంటనే పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు హాస్పిటల్ కు చేరుకుని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోగ్య విషయమై ఆరా తీస్తున్నారు.
ఎమ్మెల్యే పల్లాకు కవిత పరామర్శ
రాజేశ్వర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న కేసీఆర్ సతీమణి
ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బుధవారం గాయపడి సోమాజిగూడ లోని యశోధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. విషయం తెలియగానే హుటాహుటిన హాస్పిటల్ కు వెళ్లిన కవిత వైద్యులతో మాట్లాడి పల్లాకు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. అలాగే పార్టీ అధినేత కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో ఫోన్ లో పరామర్శించారు. ఎలా గాయపడ్డారు.. ఎక్కడ గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది. సర్జీరీ విషయమై పూర్తి వివరాలు పల్లాతో మాట్లాడి తెలుసుకున్నారు.
Recent Comments