Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలునూతన పెన్షన్ల పంపిణీ

నూతన పెన్షన్ల పంపిణీ

స్పాట్ వాయిస్, నర్సంపేట : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 10 లక్షల నూతన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో కొత్తగా 12 వేల మందికి ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం నర్సంపేట రూరల్ మండలంలోని ముగ్ధంపురం, రాజ పల్లె గురిజాల, చిన్న గురిజాల జీజీఆర్ పల్లి గుంటూరు పల్లి, లక్నేపల్లి, రామవరం, మహేశ్వరం, రాములు నాయక్ తండా, తదితర గ్రామాల్లో ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులను, ధ్రువ పత్రాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు, క్లస్టర్ భాద్యులు, పెన్షన్ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments