గవర్నర్ పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ చట్ట పరిధి దాటి మాట్లాడుతున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని పేర్కొన్నారు. గవర్నర్ వ్యవస్థ వద్దని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని, ఆ వ్యవస్థ అసరమే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడటం సరికాదని, గవర్నర్లు వారి పరిమితులకు లోబడి మాట్లాడాలని సూచించారు. గవర్నర్లను ఎలా గౌరవించాలో సీఎంకు, తమ ప్రభుత్వానికి తెలుసునన్నారు. గవర్నర్లను గౌరవించడంలో సీఎం కేసీఆర్ అందరికంటే ముందుంటారని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు జరగనప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న, మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఎలా రద్దు చేస్తారన్నారు.
Recent Comments