Friday, September 20, 2024
Homeతెలంగాణమంత్రి ఎర్రబెల్లికి నిరసన సెగ..

మంత్రి ఎర్రబెల్లికి నిరసన సెగ..

మంత్రి ఎర్రబెల్లికి నిరసన సెగ
కాన్వాయ్ ని అడ్డుకున్న తిమ్మాపూర్ గ్రామస్తులు

స్పాట్ వాయిస్ ,ఎల్కతుర్తి: పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు నిరసన సెగ తగిలింది. ఎల్కతుర్తి మండలంలో వివిధ ప్రారంభోత్సవంలో భాగంగా బుధవారం కేశవాపూర్ గ్రామంలో రైతు వేదికను ప్రారంభించి తిరిగి ఎల్కతుర్తి మండల కేంద్రానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో తిమ్మాపూర్ గ్రామ ప్రజలు అడ్డుకున్నారు.
నగరానికి కూతవేటు దూరంలో ఉండి నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే రోడ్డు గుంతలతో వర్షపు నీరు చేరి ప్రమాదాలకు కేరాఫ్ గా మారుతుందని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ మంత్రిపై మండిపడ్డారు. దీంతో మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ రోడ్డును పరిశీలించి అనంతరం మాట్లాడారు. సమస్య తీవ్రత అర్థం అయిందని స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు నెల రోజుల కిందనే రోడ్డు మంజూరు చేశామని, 15 రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చాారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్టి బాబు, ఎంపీటీసీ ఇంద్రసేనారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ముప్పు మహేందర్, మాజీ సర్పంచ్ గాజుల ఐలయ్య , గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments