Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుఎంజీఎంకు రాకేశ్ మృతదేహం..

ఎంజీఎంకు రాకేశ్ మృతదేహం..

ఎంజీఎంకు రాకేశ్ మృతదేహం..
నివాళులర్పించిన చీఫ్ విప్ దాస్యం.. టీఆర్ఎస్ నేతలు
స్పాట్ వాయిస్ , ఎంజీఎం: రాకేష్ మరణానికి కారణమైన బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ప్రభుత్వం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ మృతదేహం శనివారం ఉదయం ఎంజీఎం మార్చురీకి చేరుకుంది. విషయం తెలుసుకున్న చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, తెలంగాణ రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు తరలివెళ్లారు. రాకేష్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ..దేశ రక్షణ కోసం పాటుపడాలనే యువకులను అగ్నిపథ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరసిస్తున్నామన్నారు. రైల్వే పోలీస్ కాల్పుల్లో , వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణించడం బాధాకరం అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేష్ బలి అయ్యాడని ఆరోపించారు. రాకేష్ మరణం ముమ్మాటికీ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments