Tuesday, June 3, 2025
Homeక్రైమ్ఎలుక కొరికిన రోగి మృతి...

ఎలుక కొరికిన రోగి మృతి…

ఎలుక కొరికిన రోగి మృతి
వరంగల్ ఎంజీఎం ఘటనలో విషాదం..
స్పాట్ వాయిస్, ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన రోగి శ్రీనివాస్ మృతిచెందాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో రాత్రి 12 గంటల సమయంలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్​ను ఎంజీఎం నుంచి హైదరాబాద్​కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన తీవ్ర అస్వస్థతతో మృతిచెందినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని.. భర్త మృతితో రోడ్డునపడ్డామని మృతుడి భార్య జ్యోతి కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments