Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుమేడిగడ్డను డ్రోన్‌ తో వీడియో తీసిన వ్యక్తిపై కేసు

మేడిగడ్డను డ్రోన్‌ తో వీడియో తీసిన వ్యక్తిపై కేసు

మేడిగడ్డను డ్రోన్‌ తో వీడియో తీసిన వ్యక్తిపై కేసు

స్పాట్ వాయిస్, మహదేవపూర్ : మేడిగడ్డ బ్యారేజీతో పాటు గోదావరి నది ప్రవాహ ప్రాంతాన్ని అనుమతి లేకుండా డ్రోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు మహదేవపూర్‌ ఎస్సై పవన్‌ కుమార్‌ తెలిపారు. గత నెల 26న బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల బృందం మేడిగడ్డ బ్యారేజీ పర్యటన చేసారు. వారి పర్యటనను, బ్యారేజీ, గోదావరి వరద దృశ్యాలను ఓ వ్యక్తి డ్రోన్‌ ద్వారా చిత్రీకరించిన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. అది వైరల్‌ కాగా విషయాన్ని ఇరిగేషన్‌ అధికారులు సీరియ్‌సగా తీసుకున్నారు. ఈ ఘటనపై గతనెల 30న ఇరిగేషన్‌ ఏఈఈ వలీ మహదేవపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్‌ కుమార్‌ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments