Wednesday, April 9, 2025
Homeక్రైమ్భార్య మీద కోపం..

భార్య మీద కోపం..

భార్య మీద కోపం

 పిల్లలకు విషం తాగించిన తండ్రి

స్పాట్ వాయిస్, మహబూబాబాద్: భార్య మీద కోపం తో ఇద్దరు చిన్నారులకు విషం  తాగించాడో తండ్రి. ఈ విషాద ఘటన మహబూబాబాద్ మండలంలోని అమనగల్ శివారు బలరాం తండాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. బలరాంతండాకు చెందిన పెద్దపులి రమేష్ కు ముగ్గురు పిల్లలున్నారు. కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. రమేష్ నిత్యం మద్యం తాగుతాడ‌ని తండావాసులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం రమేష్ వేధింపులు తట్టుకోలేక అత‌ని భార్య తల్లి గారింటికి వెళ్లింది. ఈ క్రమంలో.. గురువారం రాత్రి తాగిన మైకంలో ర‌మేశ్ ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు తాగించాడు. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం మహబూబాబాద్ కేంద్రానికి తరలించారు. చిన్న కుమారుడు చికిత్స పొందుతూ చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments