Sunday, April 20, 2025
Homeక్రైమ్మానుకోటలో మరో దారుణం..

మానుకోటలో మరో దారుణం..

తండ్రిని చంపిన కూతురు
స్పాట్ వాయిస్, మానుకోట: మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి పత్రాలు ఇవ్వడం లేదని తండ్రిని కూతురు కర్రతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ మండలం వేమునూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకన్న… తన కూతురు ప్రభావతికి ఆస్తిపత్రాలు ఇవ్వడం లేదని కర్రతో కొట్టింది. గమనించిన స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆలోపే వెంకన్న ప్రాణాలొదిలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీ కూతురు ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, ఏం జరిగిందో తెలియదు కానీ ఇంత ఘోరానికి దారితీసిందని చుట్టుపక్కల ఇళ్ల వారు కన్నీరు పెట్టుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments