Monday, April 21, 2025
Homeక్రైమ్మావోయిస్టు సానుభూతి పరుడి అరెస్ట్ ..?

మావోయిస్టు సానుభూతి పరుడి అరెస్ట్ ..?

రెండు బుల్లెట్లు, తుపాకీ స్వాధీనం..
కాసేపట్లో మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం..
స్పాట్ వాయిస్, భూపాలపల్లి క్రైమ్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ మావోయిస్ట్ సానుభూతి పరుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా మావోల కదలికలపై నిఘా పెంచి కట్టుదిట్టమైన భద్రతను పెంచిన జిల్లా పోలీసులు ఓ సానుభూతిపరుడిని అదుపులోకి తీసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అదుపులో తీసుకున్న సానుభూతిపరుడిది రేగొండ మండలం గాంధీనగర్ గ్రామంగా తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న సందర్భంలో అతడి నుంచి ఒక తుపాకీ, రెండు బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా, అతడి నుంచి పూర్తి వివరాలు సేకరించారని, మరికాసేపట్లో సదరు మావోయిస్టు సానుభూతిపరుడిని జిల్లా ఎస్పీ మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశాలున్నట్టు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments