Sunday, September 22, 2024
Homeక్రైమ్వడదెబ్బతో వృద్ధుడి మృతి

వడదెబ్బతో వృద్ధుడి మృతి

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు బొడిగె రాజయ్య (75) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. మండల కేంద్రానికి చెందిన రాజయ్య అతని పాడిపశువులను తీసుకొని ఆదివారం ఉదయం మేత కోసం గణపురం శివారు పంట పొలాల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎండ వేడిమి బాగా ఉండడంతో వడదెబ్బకు గురయ్యాడు. గమనించిన కొందరు రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో అతడిని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రాజయ్య సోమవారం మృతి చెందాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments