Wednesday, April 9, 2025
Homeజిల్లా వార్తలుమల్లన్న సన్నిధిలో భక్త జన సందోహం..

మల్లన్న సన్నిధిలో భక్త జన సందోహం..

మల్లన్న సన్నిధిలో భక్త జన సందోహం..

స్పాట్ వాయిస్ హన్మకొండ రూరల్:హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయo భక్తజన సందోహం అయిoది. స్వామి దర్శనం కోసం ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలిరాగా ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. భక్తుల శివ నామ స్మరణతో మల్లన్న ఆలయ మంతా మార్మోగిపోయింది. కోరిన కోర్కెలు తీర్చే కోర మీసాల మల్లన్న స్వామికి భక్తులు పట్నాలు వేసి,బోనాలు చేసి,ఒళ్లు పడుతూ మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గు కథలు, డోలు సప్పుల్లు, శివ సత్తుల పునకాలు,మహిళల కోలాట విన్యాసాలతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments