Saturday, April 19, 2025
Homeతెలంగాణఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు షురూ

ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు షురూ

స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాగరాజు
స్పాట్ వాయిస్, హన్మకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి- 2025 బ్రహ్మోత్సవాల అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, టెస్ కాబ్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు హాజరై శ్రీమల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వారికి పూర్ణకుంభంతో వేద మంత్రాల నడుమ స్వాగతం పలికారు. కండువా కప్పి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని ఉత్సవాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ సహకారంతో బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉత్సవాల సాఫీగా సాగేలా ముందుకు వెళ్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు ఆలయ ఈవో కార్యాలయంలో ఉత్సవ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి, ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ , ఆలయ ఈవో నాగేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments