Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుఎడ్లపల్లి సాయి మందిరంలో రాములోరి పెళ్లి

ఎడ్లపల్లి సాయి మందిరంలో రాములోరి పెళ్లి

ఎడ్లపల్లి సాయిబాబా మందిరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

స్పాట్ వాయిస్ ,మల్హర్: మండలంలోని ఎడ్లపల్లి షిరిడి సాయి బాబా మందిరంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మల్హర్ మండలంలోని వివిధ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు . భక్తులు స్వామివారిని సేవించి, వడపప్పు, పానకాలను ప్రసాదాలుగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్సై సత్యనారాయణ సతీసమేతంగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్నారు. అన్నదాతలు బిరుదురాజు దామోదర్ శ్రీవాణి దంపతుల సహకారంతో 500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేశారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న పలువురు ప్రముఖులను ఎడ్లపల్లి షిరిడి సాయి బాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్హర్ రావు , సర్పంచ్ జనగామ స్వరూపబాపు, ఉప సర్పంచ్ తోట రాజేశ్వర్ రావు, వార్డు సభ్యులు మెరుగు శ్రీను, ఎడ్లపల్లి షిరిడి సాయి బాబా ఆలయ కమిటీ చైర్మన్ బత్తుల తిరుపతి, ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు కోలేటి రాజబాపు, ప్రధాన కార్యదర్శి జంగిడి సమ్మయ్య, కోశాధికారి ఉప్పట్ల ప్రభాకర్, డైరెక్టర్లు తోట సత్యం, దుబాసి రాజయ్య, తొగరి శంకర్, మద్దెల లక్ష్మణ్, వివిధ పార్టీలకు చెందిన లీడర్లు వాల యాదగిరి రావు, ఎర్రం నర్సింహ రాజు, జనగామ పోచయ్య, జంగిడి శ్రీనివాస్, అక్కినవేని సమ్మయ్య, అక్కినవేని సుమన్, దబ్బేటి నగేష్, అక్కినవేని మాంతయ్య, గుర్రం సారయ్య, జనగామ లక్ష్మీరాజం, పంథకాని బాపు, గుర్రం సారయ్య, ఎర్రం వికాస్ రాజు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments